మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

Mar 28,2024 20:56

ప్రజాశక్తి – పూసపాటిరేగ : మరోసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పి. సురేష్‌బాబు, వైసిపి జిల్లా నాయకులు కందుల రఘుబాబు అన్నారు. గురువారం మండలంలోని గోవిందపురం, భరణికాం, లంకలపల్లి గ్రామాల్లో వైసిపి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ సందర్బంగా వారు ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మొహన్‌రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా బెల్లాన చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలంటే ఈ ప్రభుత్వం మరలా రావాలన్నారు. ప్రచారంలో నియోజకవర్గ పరిశీలకులు నెక్కల నాయుడు బాబు, ఎంపిపి మహంతి కళ్యాణి, వైస్‌ ఎంపిపిలు రమేష్‌, సత్యనారాయణరాజు, వైసిపి మండల అధ్యక్షలు పతివాడ అప్పలనాయడు, జెసిఎస్‌ కన్వినర్‌ మహంతి శ్రీనువాసరావు, నాయకులు మహంతి జనార్దనరావు, బర్రి చిన్నప్పన్న, గోవిందపురం నాయకులు పట్టెపు శ్రీనువాసరావు, బోర చిన్నారెడ్డి, రౌతు సాయికుమార్‌, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తెర్లాంలో ఎమ్‌పి బెల్లాన ప్రచారం తెర్లాం: మండల కేంద్రంలో ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు పొందిన వారంతా మరోసారి తమను ఆశీర్వాదించి గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అనంతరం పెరుమాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెరుమాలి మాజీ సర్పంచ్‌ వెలగాడు కృష్ణ, కుప్ప సత్యనారాయణ, జరజాన రవి, బాణాల లక్ష్మణరావు, ముదునూరు సత్యనారాయణ రాజుతో పాటు సుమారు 15 కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు సత్యంనాయుడు, వైసిపి సీనియర్‌ నాయకులు బాబ్జిరావు, ఎఎంసి చైర్మన్‌ బి శ్రీనివాసరావు, తిరుమల మాజీ సర్పంచ్‌ కె వెంకట అప్పారావు, అప్పలరాజు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

➡️