మహాధర్నాపై ప్రచార జాతా ప్రారంభం

Nov 24,2023 17:45 #జాతా
జాతా

ప్రజాశక్తి-కాకినాడనవంబరు 27, 28 విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు, ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఆటో జాతాను ప్రారంభించారు. కాకినాడ కలెక్టరేట్‌ వద్ద జెండా ఊపి జాతాను సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రైతాంగ సంక్షోభం పెరిగి ప్రతి 20 నిమిషాలకూ ఒక రైతు దేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పారు. మోడీ కార్పొరేట్‌ స్నేహితులకు లాభం చేకూర్చేందుకు కార్మికుల హక్కులన్నింటినీ తొలగిస్తూ బానిసలుగా మార్చేందుకు 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్లు తీసుకొచ్చారని విమర్శించారు. తక్షణం రైతులను సంక్షోభం నుంచి బయటపడేందుకు రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, ఏ రంగంలో పని చేసే కార్మికులకైనా కనీస వేతనం రూ.26,000 తగ్గకుండా నిర్ణయించి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 90 శాతం వ్యవసాయ భూమిలో కౌలు రైతులు పనిచేస్తున్నారని, జగన్‌ ప్రభుత్వం కనీసం గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేయలేదని, బ్యాంకు రుణాలు అందక కౌలు రైతులు దళారీల చేతిలో బందీలుగామారి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. క్షేత్రస్థాయిలో పంటలు పండించేందుకు కష్టపడే రైతాంగానికి, కౌలు రైతులకు బేషరతుగా రుణాలు అందించాలని, పండించిన పంటలన్నీ ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, ఐఎన్‌టియుసి ఎపి, తెలంగాణ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తాళ్లూరు రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్‌కుమార్‌, జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, తొట్టిపూడి రాజా, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు జ్యోతి, నాగూర్‌, దేవి, ఎఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్‌ గొడుగు సత్యనారాయణ, నరసరాజు, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌ నరాల శివ, రాణి, చంద్రరారావు పాల్గొన్నారు.కోటనందూరు మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాల, కార్మికుల హక్కుల , సమస్యల పైన ఈనెల 27 28 తేదీల్లో జరిగే మహా ధర్నాకు అన్ని రంగాల కార్మికులు రావాలని శుక్రవారం నాడు మండల కేంద్రమైన కోటనందూరులో సిఐటియు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తుని సిఐటియు నాయకులు నక్కెళ్ళ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చట్టాలు పేరుతో తీసుకువచ్చిన నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని ,కార్మికులకు చెందవలసిన భీమాను, నష్టపరిహారాలను , మరణించిన కార్మికులకు రావలసిన పరిహార నిధులను తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని, ఆశ అంగన్వాడీ మిడ్‌ డే మీల్స్‌ వర్కర్లకు కనీస వేతనాలు కాలనీ పెన్షన్‌ సౌకర్యాలు కల్పించాలని పలు డిమాండ్లతో కూడిన వాటిపై జరిగే మహా ధర్నా ధర్నాను చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల కార్మికులు ఈ ధర్నాలో పాల్గొని మన హక్కులు సాధన కొరకు పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు కమిటీ సభ్యులు బత్తిన నాగేశ్వరరావు, కోటనందూరు సిఐటి అధ్యక్షులు రమణ, అంగన్వాడీ టీచర్లు ఝాన్సీ జగదీ, ఆశ, మహాలక్ష్మి, కుసుమ, కమల, రాణి, సత్యవతి రామలక్ష్మి, నాగలక్ష్మి, దుర్గ, లక్ష్మీ పాల్గొన్నారు.

➡️