రైతులపై నిర్బంధాన్ని వ్యతిరేకించండి

Feb 27,2024 14:59 #Dharna, #rythulu, #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని,మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే రైతులపై పోలీసులతో బుల్లెట్ల వర్షం కురిపించిన బిజెపి వైఖరిని ప్రజలు వ్యతిరేకించాలని రైతులకు అండగా నిలబడాలని ఎన్ వై ఎస్,పి డి ఎస్ ఓ నాయకులు పి.అప్పలరాజు,రాజేష్ లు కోరారు.మంగళవారం రైతులు పోరాటానికి మద్దతు తెలియచేస్తూ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని,పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని,ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి భారత్ బయటకు రావాలనీ డిమాండ్ చేశారు.రైతులు కొద్ది రోజుల గా దేశ రాజధానిలో రైతులు కు ఇచ్చిన హామీలు కోసం పోరాటం చేస్తుంటే వారి పై పోలీసులను ఉపయోగించి ఆందోళన కారులపై గుల్ల వర్షం కురిపించడం సరికాదన్నారు.వెంటనే రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి,పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో గిరిప్రసాధ్,దిలీప్,నాగరాజు,హర్షవర్ధన్,శేకర్ లు పాల్గొన్నారు.

➡️