సిడిపిఒకు అంగన్‌వాడీల సమ్మె నోటీసు

ప్రజాశక్తి – చింతలపూడి

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వచ్చేనెల ఎనిమిదో తేదీ నుంచి సమ్మె చేపడుతున్నామని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సభ్యులు బిజెఎన్‌.కుమారి, చింతలపూడి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.సరోజని, టి.మాణిక్యం తెలిపారు. ఈ మేరకు సమ్మె నోటీసును సిడిపిఒ టి.లీలకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో మాదిరి ఇక్కడ కూడా అంగన్‌వాడీలకు అన్ని సౌకర్యాలూ కల్పించాలని కోరారు. పని భారం పెరిగింది తప్ప జీతాలు మాత్రం పెరగడం లేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె చేపడుతున్నామని తెలిపారు. ఏళ్లతరబడి అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య థోరణితో వ్యవహరిస్తుందని విమర్శించారు. సిఎం జగన్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. నిత్యావసరాల ధరలు ఒకవైపు విపరీతంగా పెరుగుతుంటే జీతాలు మాత్రం పెరగడం లేదన్నారు. అంగన్‌వాడీలకు గ్రాడ్యుటీ చెల్లించాలని ఉన్నత న్యాయస్థానాలు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నత్త వెంకటేశ్వరరావు, జి.సరళ, డి.ఫణివర్థిని, అరుణ, కవిత, చెన్నకేశ్వరి, ఈశ్వరి, శాంతిశ్రీ పాల్గొన్నారు.

➡️