సూపర్‌ మార్కెట్‌ యజమానికి ఎమ్మెల్యే పరామర్శ

 పల్నాడు జిల్లా: చిలకలూరిపేట రోడ్డులోని చరిష్మ సూపర్‌ మార్కెట్‌ లో అగ్నిప్రమాదం సంభవించిన నేప థ్యంలో సూపర్‌ మార్కెట్‌ యజమాని ఏలూరి నాగేశ్వరరావును ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి సోమవారం పరామర్శించారు. ఘటనపై ఎవరిపైన అయినా అనుమానం ఉంటే చెప్పాలని విచారణకు తన సహకారం అందిస్తానని చెప్పారు. తనకు ఎవరితో శత్రుత్వం లేదని ఎవరిపై కూడా అనుమానాలు లేవని నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ నష్టపరిహారం క్షేత్ర స్థాయిలో అంచనా వేయాలని ఘటనకు కారణంపై విచారణ జరిపి నిగ్గు తేల్చాలని తహశీల్దార్‌ రమణ నాయక్‌ ను ఆదేశించారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న చరిష్మ సూపర్‌ మార్కెట్‌ కు ఇది కోలుకోలేని ఘటన అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటన ను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.

➡️