సిపిఎం అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

హక్కులు చట్టాలు రక్షించుకుందాం
ప్రజాశక్తి-విఆర్ పురం : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించడం ద్వారా ఏజెన్సీలో హక్కులు చట్టాలు పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఎం మండల కార్యదర్శి సోయం చినబాబు జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ అన్నారు. శనివారం మండలంలోని మొద్దులగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. వరదలు వస్తే ముందుగా ముద్దులగుడ గ్రామం మనకు గురై రెండువైపులా రహదారులు బంద్ అయ్యే పరిస్థితి ఉందని నాయకులకు అక్కడే ప్రజలు వివరించారు. అయినప్పటికీ మద్దులగూడెం గ్రామాన్ని ముంపులో చేర్చక పోవటం ఏమిటని వారు ఆవేదనలను వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూమన ఎమ్మెల్యే చట్టసభలో ఉంటే మీ గ్రామాన్ని ముప్పులో చేర్చి ప్యాకేజీ ఇచ్చేలా చేస్తారని పోడు భూములు సమస్య మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే జీరో నెంబర్ 3 చట్టం పగద్బంధిగా అమలు అయితే మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందని వారు అన్నారు. మీ అమూల్యమైన ఓటు మన ఎమ్మెల్యే కి వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

➡️