వైసిపిలో చేరిన అనకాపల్లి యువకులు

Apr 17,2024 11:42 #anakapalli, #joined YCP, #youths

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : అనకాపల్లి నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్‌హొకుమార్‌ సమక్షంలో ఏ.ఎస్‌ పేట గ్రామంలో ఉన్న వారి నివాసం వద్ద బుధవారం నర్సింగబిల్లి గ్రామనికి చెందిన మోత్తుకూరి రాజు, శివరాత్రి లింగాలు, శివరాత్రి ఈశ్వరరావు, మోతి చంటయ్య, మోతి గుర్రప్ప, మోతి మాణిక్యం, శివరాత్రి నూకరాజు, శివరాత్రి రాజప్పారావు, శివరాత్రి కొండయ్య, మోతి శ్రీను, కళ్యాణి రాజు పలువురు సభ్యులు వైసీపీలో చేరారు. వీరికీ మలసాల భరత్‌ కుమార్‌ పార్టీ కండువా వేసి వైసిపి లోకి సాదరంగా ఆహ్వానించారు, ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్‌ కుమార్‌ మాట్లాడుతూ … నియోజకవర్గంలో ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీకి ఓటు వేసి ఎమ్మెల్యేలను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కసింకోట మండల పార్టీ అధ్యక్షులు మలసాల కిషోర్‌, గ్రామ సర్పంచ్‌ కోన అరుణ నాగేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు కోన సోము నాయుడు, ఉపసర్పంచ్‌ సేనాపతి నారాయణరావు, యూత్‌ ప్రెసిడెంట్‌ రాజన్న విజరు కుమార్‌, బూతు కమిటీ మెంబర్స్‌ కట్టుమూరు చంద్రశేఖర్‌, రాజన్న నాగేశ్వరరావు, గ్రామ పార్టీ నాయకులు శివరాత్రి నూకరాజు, ఊడి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️