ప్రజాశక్తి-మర్రిపూడి: మండలంలో అంగన్వాడీ కార్యకర్తలు, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరి స్తానని రాష్ట్ర మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. మంత్రిగా తొలిసారి మండల కేంద్రం మర్రిపూడికి వచ్చిన సందర్భంగా ఆయనను మండల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. తాము సమ్మె కాలంలో తమ వద్దకు వచ్చి మా సమస్యలపై స్పందించిన విషయాన్ని వారు గుర్తుచేస్తూ కొన్ని గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవని, మరికొన్ని చోట్ల మరమ్మతులకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలపై అంగన్వాడీలు మంత్రికి వినతిపత్రం అందజేశారు. మంత్రి స్వామి స్పందిస్తూ నూతన భవనాల విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి త్వరలోనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/MRPD-PH-1.jpg)