ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : ప్రజా వ్యతిరేక బిజెపిని, దాని పొత్తు పార్టీలను ఓడించాలని, ఇండియా వేదిక అభ్యర్థుల్ని గెలిపించాలని ఇండియా వేదిక బలపరిచిన సత్తెనపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చుక్కా చంద్రపాల్ కోరారు. సత్తెనపల్లి పట్టణం, మండలంలోని పాకాలపాడు, రెంటపాళ్ల, ఫణిదం గ్రామాల్లో ఆయన సిపిఎం, సిపిఐ నాయకులతో కలిసి బుధవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. జీఎస్టీ పేరుతో ప్రజల నుండి రూ.కోట్లు దోచుకుని, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టుతున్న బిజెపిని తిరస్కరించాలని కోరారు. మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన పార్టీలను, అప్రకటిత మిత్రపక్షంగా ఉన్న వైసిపిని ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. తనతోపాటు నరసరావుపేట ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలెగ్జాండర్ సుధాకర్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పి.మహేష్, నాయకులు ఎం.నరశింహారావు, సిపిఐ నాయకులు ఇర్మియా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డి.జ్జాన్రాజ్పాల్, ముప్పాళ్ల మండల అధ్యక్షులు కె.ఆనంద్ బీసీ నాయకులు ఎం.శంకర్, సిపిఎం నాయకులు బి.రామారావు, డి.మేరమ్మ, సిహెచ్.లక్ష్మీనారాయణ, ఆర్.పూర్ణచంద్రరావు, కాంగ్రెస్ నాయకులు ఎస్.మోహనరావు, జె.శేఖర్, జక్రీయా పాల్గొన్నారు.