అట్టులేసి.. ఓట్లడిగి..

May 8,2024 21:22

ప్రజాశక్తి-విజయనగరం కోట: టిడిపి అభ్యర్థి పూసపాటిరే అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. 19వ డివిజన్‌ లంకాపట్నం, బంగారమ్మ కోలనీ, సోము వీధి, బంగారి వీధి, రామమందిరం ఏరియా, రౌతు వీధి, గోకవీధి, హుకుంపేట ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. లంకాపట్నం వద్ద రోడ్డు పక్కన తోపుడు బండిపై టిఫిను అమ్ముతున్న మహిళ వద్దకు వెళ్లి దోసెలు వేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, పింఛను రూ.4 వేలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, అవనాపు విజరు పిల్లా విజరు కుమార్‌ గాడు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. విద్యావతి ఇంటింటా ప్రచారం టిడిపి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతికు మద్దతుగా బుధవారం ఆమె సోదరి విద్యావతిదేవి బుధవారం ప్రచారం చేపట్టారు. నగరంలోని 14వ డివిజన్‌ కుమ్మరి వీధి, శాలి వీధి, కొత్తపేట, పులిగెడ్డవారి వీధి, బ్రాహ్మణ వీధి, కూరాకుల గట్టు ప్రాంతాలలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి, అదితికి మద్దతివ్వాలని కోరారు.

➡️