ప్రజలకు అండగా ఉంటా : బాలినేని

ప్రజాశక్తి-కొత్తపట్నం: తనను ఆదరిస్తే ప్రజలకు అండగా ఉంటామని వైసిపి ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో మన ఒంగోలు- మన వాసన్న కార్యక్రమం, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివద్ధి పనులు గురించి ప్రజలకు వివరించారు. తనకు మరో అవకాశం కల్పిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ముఖ్యమంత్రి అమలులోకి తెచ్చిన వాలంటీర్‌ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. ఎన్నో అడ్డంకులు ఎదురైనా టిడిపి నేతలు కుట్రలు పన్నినా నగరంలో 25వేల ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇల్లుకట్టిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గాదెపాలెం, గుండమాల, మోటు మాల, పాదర్తి ,పిన్నివారిపాలెంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లంకపోతు అంజిరెడ్డి , జడ్‌పిటిసి సైకం లక్ష్మీ శారద , సర్పంచులు మండల వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

➡️