ప్రజాశక్తి-చాగల్లు (తూర్పుగోదావరి) : చాగల్లు మండలంలో మంగళవారం ఆకస్మికంగా వచ్చిన గాలి వాన వల్ల నష్టపోయిన అరటి రైతులను ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి గారపాటి సుబ్బారావు డిమాండ్ చేశారు. బుధవారం నేలకూలిన అరటి తోటలను సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరటి తోటలు నష్టపోయిన ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో మిచౌంగ్ తూఫాను వల్ల నష్టపోయిన అరటి రైతులకు ఇప్పటివరకు పరిహారం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సంఘం నాయకులు గుత్తుల శ్రీను చెరుకూరు తదితరులు పాల్గొన్నారు.