స్వతంత్ర అభ్యర్ధిగా రైతు బిడ్డ భాగ్యలక్ష్మి : రైతే రాజు నినాదంతో భాగ్యలక్ష్మి ఎన్నికల ప్రచారం

ప్రజాశక్తి – మార్కాపురం
ఇటీవల కాలంలో పట్టణంలో ఫ్లెక్సీలతో ప్రజలను ఆలోచింపజేసిన రైతు బిడ్డ రావెళ్ల భాగ్యలక్ష్మి ఎట్టకేలకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. తొలుత ఆమె శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంది, మార్బలం, హాట్టహాసాలు లేకుండా గడప గడపను తిరుగుతానని ఆమె వెళ్లడించారు. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. ప్రతి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం నిర్వహించి తన సత్తా చాటుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో రైతు బిడ్డ భాగ్యలక్ష్మి ఎంతవరకు పోటీ ఇస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

➡️