ఆనందబాబు విస్తృత ప్రచారం

ప్రజాశక్తి – వేమూరు
చుండూరు, భట్టిప్రోలు మండలాల్లో టిడిపి అభ్యర్థి నక్కా ఆనందబాబు విస్తృతంగా సోమవారం ప్రచారం చేశారు. చుండూరు మండలం వలివేరు, నడిగడ్డపాలెం, వేటపాలెం గ్రామాల్లో మధ్యాహ్నం వరకు ప్రచారం చేశారు. భట్టిప్రోలులో సాయంత్రం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా తనను, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి టి కృష్ణ ప్రసాద్‌ను గెలిపించాలని కోరారు. వైసిపి పాలనలో ఎలాంటి అభివృద్ధి లేదని, అరాచక పాలన కొనసాగిందని అన్నారు. అరాచక వైసిపి పాలనను అంతం చేసేందుకు ఓటుతో బుద్ది చెప్పాలని కోరారు. నిలిచిపోయిన అభివృద్ధి, సంక్షేమం కొనసాగడానికి చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని కోరారు. కార్యక్రమంలో చుండూరు, భట్టిప్రోలు మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️