ప్రజాశక్తి – కర్లపాలెం
మండలంలోని చింతాయపాలెం, గణపవరం గ్రామాల్లో టిడిపి ఎంఎల్ఎ అభ్యర్ధి వేగేశన నరేంద్రవర్మ గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు. రానున్న ఎన్నికల్లో తనను ఎంఎల్ఎగా, తెన్నేటి కృష్ణ ప్రసాద్ను బాపట్ల ఎంపిగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపి, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్ సతీమణి తెన్నేటి శిరీష, జనసేన ఇన్ఛార్జి నామన శివన్నారాయణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.