చీరాల బహిరంగ సభకు ఆహ్వానం

Apr 10,2024 15:28 #Bapatla District

వైఎస్ షర్మిలను ఆహ్వానించిన ఆమంచి కృష్ణమోహన్
ప్రజాశక్తి-వేటపాలెం : బెంగళూరులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై యస్ షర్మిలని బుధవారం వారి నివాసంలో మర్యాద పూర్వకం గా కలిసిన చీరాల మాజీ శాసన సభ్యులు ఆమంచి కృష్ణమోహన్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి తనని ఆహ్వానించినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు. చీరాలలో జరగబోయే బహిరంగ సభకు ఆహ్వానించారు. ఆమంచి కృష్ణమోహన్ తో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రెగొరీ చీరాల రూరల్ సీనియర్ నాయకులు మేడిబోయిన బలరామి రెడ్డి, వేటపాలెం మండల సీనియర్ నాయకులు బండ్ల బాబు, చీరాల సీనియర్ నాయకులు కోటి దాసు, మాజీ కౌన్సిలర్ శీలం శ్యామ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ బజ్జి బాబు , షైక్ రెహ్మాన్, ఎండ్రపాటి సునీల్ వై యస్ షర్మిలని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

➡️