ప్రజాశక్తి-బాపట్ల : బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న హాస్టల్స్ లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సోమవారం తెల్లవారు జాము నుంచి బాపట్ల డిఎస్పీ వెంకటేసులు ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసు సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్స్ లో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా, గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఏమైనా వారి రూములలో ఉన్నాయా అన్న విషయమై పోలీస్ లు తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డిఎస్పి వెంకటేశులు, ట్రైనింగ్ డిఎస్పీ విద్యా శ్రీ మరియు పట్టణ రూరల్ సిఐలు, ఎస్సై లు పాల్గొన్నారు.