హనుమంతరావుకి నివాళి

Mar 22,2024 14:24 #Bapatla District

ప్రజాశక్తి – యద్దనపూడి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కీ!!శే గొట్టిపాటి హనుమంతరావు 27వ వర్థంతి సందర్బంగా యద్దనపూడి గ్రామములోని హనుమంతరావు ఘాట్ వద్ద అద్దంకి శాసన సభ్యులు గొట్టిపాటి రవి కుమార్ శుక్రవారం ఆయన సమాధికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా రవి కుమార్ మాట్లాడుతూ తన పెద నాన్న పేదల సంక్షేమము కోసం పని చేశారని తాము కూడ ఆయన ఆశయాలు సాధించుటకు ప్రయత్నం చేస్తాము అన్నారు. కార్యక్రమంలో గొట్టిపాటి భరత్, గొట్టిపాటి కమల కిషోర్ (బాబి ), గ్రామ నాయకులు వెంకటరావు, శ్రీరామ మూర్తి, హనుమంతరావు, పెరవలి శ్రీనివాసరావు, మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

➡️