ప్రజాశక్తి-కొండపి : దేశాన్ని అన్ని విధాలుగా అధోగతి పాలు చేసిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించాలని కాంగ్రెస్ పార్టీ కొండపి నియోజకవర్గ అభ్యర్థి పసుమర్తి సుధాకర్రావు తెలిపారు. మర్రిపూడి మండలం లోని పలు గ్రామాలు, కొండపి మండల పరిధిలోని అనకర్లపూడి, నెన్నూరుపాడు, మూగచింతల గ్రామా లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి బ్యాలెట్ నమూనా పత్రాలు పంపినీ చేశారు. అనంతరం సుధాకర్రావు మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూలిపోయినట్లు తెలిపారు. రైతుల ఆత్మహత్యలు రెట్టింపు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన బిజెపిని ఓడించాలన్నారు. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుదాకర్రెడ్డి, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు, మండల అధ్యక్షుడు మాల కొండయ్య, తూగుట్ల శ్రీనివాస రెడ్డి, పెద్ద శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. మద్దిపాడు : ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులను సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని సిపిఎం మండల కార్యదర్శి ఉబ్బా ఆదిలక్ష్మి, నాయకులు కనపర్తి సుబ్బారావు తెలిపారు. మద్దిపాడులో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంతనూలపాడు ఎమ్మెల్యే అభ్యర్థి పాలపర్తి విజరు రాజును, బాపట్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జెడి శీలంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఇంటింటికీ తిరిగి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు, కాశిం, శ్రీను, కాకుమాను సుబ్బారావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బారావు పాల్గొన్నారు.