ఆ రెండు పార్టీలూ బిజెపి వైపే

ప్రజాశక్తి-శింగరాయకొండ: రాష్ట్రంలోని టిడిపి, వైసిపి బిజెపికి అనుకూలంగా ఉంటాయని, ప్రజలు ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఇండియా వేదికకు అండగా నివాలని, కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఈదా సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ కొండపి నియోజక వర్గ ఎమ్మెల్యే పసుమర్తి సుధాకర్‌రావు కోరారు. టంగుటూరులో ఇండియా వేదిక సభ్యులు ఆదివారం సమావేశం నిర్వహించారు. అనంతరం సుధాకర్‌రెడ్డి, సుధాకరరావు విలేకర్లతో మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎవరూ అధికారంలోకి వచ్చినా నరేంద్ర మోడీకి అండగా ఉంటారని తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు. భారత రాజ్యాంగాన్ని నాశనం చేసే విధంగా నరేంద్ర మోడీ, అమిత్‌షా కుట్ర పన్నుతున్నట్లు తెలిపారు. వలస దారులను నమ్మి ఓట్లు వేయవద్దని కోరారు. ఢిల్లీలో రైతుల ధర్నా సందర్భంగా హామీలు ఇచ్చి మోసం చేసిన నరేంద్ర మోడీని తరిమి కొట్టాలన్నారు. రాష్ట్రం అభివద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కెజి.మస్తాన్‌, వి.మోజెస్‌, టంగుటూరి రాము, అంబటి వందనం, సిపిఐ నాయకులు కె.వీరారెడ్డి, బాలకోటయ్య, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎస్‌కె.రసూల్‌, బొడ్డు సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️