ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : ఎండలు అధికంగా ఉన్నాయని ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కూటమి నాయకులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, ఎన్నారై రాయుడు వెంకటేశ్వరరావు, కర్రీ వీరబాబు అన్నారు. జాతీయ రహదారి 216 ఎ పక్కన మండలంలోని చెముడులంక సెంటర్ వద్ద టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి పార్టీల నాయకులతో కలసి మజ్జిగ చలివేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ దాతఅత్యాన్ని చాటుకుని ప్రయాణికుల దాహార్తి తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస నగర్ యూత్ పాల్గొన్నారు.