అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థికి అభినందన

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : మండల పరిధిలోని కనుపర్తి భావజ్ఞ సాయి పదవ తరగతిలో 597 మార్కులతో స్టేట్‌ మూడవ ర్యాంక్‌, కృష్ణాజిల్లాలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించటంతో ఆదివారం వివిధ సంఘాలు ఆ విద్యార్థినిని ఘనంగా సన్మానించారు. అభినందన సభకు ఎపి సెక్రటేరియట్‌ లో న్యాయశాఖ జాయింట్‌ సెక్రటరీ వెలగపల్లి వెంకటేశ్వరావు, రాష్ట్రపతి అవార్డ్‌ గ్రహీత కొక్కిలిగడ్డ మణిప్రభాకరరావు లు ముఖ్యఅతిథిలుగా హాజరై మాట్లాడుతూ … కూలి ని సైతం కలెక్టర్‌ గా మార్చగలిగినది తక్కువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్లగలిగేది విద్య మాత్రమే అన్నారు. భావజ్ఞ ప్రతిభ వెనుక తల్లిదండ్రుల కృషి ప్రశంసనీయం అన్నారు. తరువాత భావజ్ఞను శాలువా, పూలబకే, ఆక్స్‌ఫర్డ్‌ లెర్నెర్స్‌ డిక్షనరీస్‌ ను బహుకరించారు. విశ్రాంత ఈ ఓ ఆర్‌ డి , ఎపి చైతన్య వేదిక కన్వీనర్‌ దాసి సీతారామరాజు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో… అడ్డాడ ప్రసాద్‌, ఉప్పల సాంబశివరావు, అల్లూరి బాబూరావు, విశ్రాంతి గృహ నిర్మాణ సంస్థ ఏఈ.బసవ శంకరరావు, గ్రామ రెవెన్యూ అధికారి ఓలేటి నాగమల్లేశ్వరరావు, నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు అవనిగడ్డ ఈశ్వరరావు, ఏ.శివకుమార్‌ రాజా, భావజ్ఞ తల్లిదండ్రులు వీరవెంకటేశ్వరావు, అరుణ కుమారి, తదితరులు పాల్గొన్నారు.

➡️