ప్రజాశక్తి -గోపాలపట్నం : పశ్చిమ నియోజకవర్గంలో ఇండియా ఫోరం నుంచి పోటీలో సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి అత్తిలి విమల శనివారం కొత్తపాలెం, నాగేంద్ర కాలనీ, సంతోష్ కాలనీ, తిరువీధుల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజలను సమస్యలనడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇస్తూ 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసే గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి సత్యనారాయణ, ఎస్కె.రెహమాన్, ఆర్.శ్రీనివాస్, పుష్ప, దేముడమ్మ, రవి, చిరంజీవి, లక్ష్మణరావు, అచ్యుత్, పార్టీ సానుభూతి పరులు పాల్గొన్నారు.