ప్రొఫెసర్ వార్డ్ బైరన్ స్కాట్
ప్రజాశక్తి-గుంటూరు: భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజ కీయ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారానే భారతీయ ప్రజా స్వామ్యం వర్ధిల్లు తుందని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ప్రముఖ రాజనీతి, మానవీయ శాస్త్ర ప్రొఫెసర్ వార్డ్ బైరన్ స్కాట్ పేర్కొన్నారు. నెదర్లాండ్కు చెందిన అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన యూనివర్సిటీ ఆఫ్ ఆమస్టేర్ లో ప్రొఫెసర్ గా పని చేస్తూ ఇండియా,ఇండోనేషియాలో ఎన్నికల తీరును పరి శీలిస్తూ ఈ నెల 11వ తేదీన రాత్రి గుంటూరు లోని జన చైతన్య వేదిక కార్యాలయాన్ని ప్రొఫెసర్ వార్డ్ బైరన్ స్కాట్ సందర్శించి పలు పౌర సంస్థల ప్రతినిధులతో చర్చించారు. వీరితోపాటు కింగ్స్ కాలేజీ లండన్కు చెందిన ప్రొఫెసర్ విగేష్ కార్తీక్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు చెందిన పూర్వ ప్రొఫెసర్ కొండవీటి చిన్నయ్య సూరి భారతీయ ఎన్ని కల తీరుతెన్నులపై చర్చించారు. ఈ సందర్భంగా వార్డ్ బైరన్ స్కాట్ ప్రసంగిస్తూ ప్రపంచంలో ఎన్నికలలో డబ్బు పాత్ర బలంగా ఉన్న దేశాలు అభివృద్ధి చెందలేకపోయాయని, ఇదే పరిస్థితి భారతదేశంలో ఉత్పన్నమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు,మద్యం,కుల మతాల ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలను చైతన్యవంతులను చేసే బాధ్యత బలమైన పౌర సంస్థలు, మేధావులు తీసుకోవాలన్నారు. తక్షణం రాజ కీయ, ఎన్నికల సంస్కరణలకు రాజకీయ పార్టీలు పూనుకోవా లని అన్నారు. ప్రొఫెసర్ విగేష్ కార్తీక్ మాట్లాడుతూ రాజ కీయ పార్టీలకు ఎన్నికల నిధులు ప్రజల నుండి సేకరించాలని ప్రభుత్వాలు కూడా కొంతమేరకు నిధులు ఇవ్వడం ద్వారానే రాజకీయ కార్పోరేటీకరణను నివారించవచ్చని అన్నారు. ఎన్నికలలో డబ్బు ప్రభావం తగ్గటానికి ఓటర్లలో నైతిక బలం పెరగాలన్నారు. ప్రముఖ రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ కొండవీటి చిన్నయ్య సూరి ప్రసంగిస్తూ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారుతూ వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు నడపడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల బరిలో కేవలం వెయ్యి కుటుంబాలు మాత్రమే పోటీ పడుతున్నాయని అన్నారు. సేవా తత్పరులు , మేధావులు,ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న చైతన్య వం తులైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ పడలేకపోతున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. చర్చా గోష్ఠి లో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రత్యూష సుబ్బారావు, మానవత సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, రేట్ పేయిర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓ .నారాయణరెడ్డి ,ఆమ్ ఆద్మీ నేత శివప్రసాద్, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నేత కోట రమేష్ ,తెలుగు భాషోద్యమ సంస్థ కన్వీనర్ డాక్టర్ వి రంగారావు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ చిల్లర శంకర్ ప్రసంగించారు.