ప్రజాశక్తి-చీరాల: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడవాలంటే, మైనార్టీల అభ్యున్నతి జరగాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఉందని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. మంగళవారం పేరాల కోర్టు రోడ్లో ఉన్న షాదీఖానాలో ముస్లీము ల ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిథిగా ఎంఎం షరీఫ్ పాల్గొన్నారు. బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్, చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి మద్దులూరు మాలకొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ హక్కులను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు. అయితే మైనార్టీ హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాసిందని, కాబట్టి మైనార్టీలు అందరూ తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి పార్లమెంట్ అభ్యర్థి కృష్ణ ప్రసాద్కు, శాసనసభ అభ్యర్థి కొండయ్యకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మైనార్టీలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరావు, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి ఎస్కె యాసిన్, చీరాల పట్టణ అధ్యక్షుడు ఎస్కే మొహిద్దీన్, ఎస్కే కరిముల్లా, సయ్యద్ బాబు, ఎస్కె మస్తాన్వలి, కౌన్సిలర్ సూరగాని లక్ష్మి, సజ్జా వెంకటేశ్వరరావు, పలువురు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.