విజయనగరం కొత్తపేటలో బియ్యం పంపిణీ

Mar 3,2024 12:58 #Distribution, #rice, #Vizianagaram

ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యులు కె.ఆర్‌ హెల్పింగ్‌ హాండ్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ బి.కాంతారావు యాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం విజయనగరం నియోజకవర్గంలో కొత్తపేట సాకేత్‌ వీధిలో బడుగు బలహీన పేద వర్గాలకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.

ట్రస్ట్‌ చైర్మన్‌ బి. కాంతారావు యాదవ్‌ మాట్లాడుతూ … విజయనగరం నియోజకవర్గం కేంద్రంగా గడిచిన 8 నెలల నుండి పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ వార్డులో ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరిగిందన్నారు. అభివఅద్ధి చెందుతున్న సమాజంలో అన్ని వర్గాల వారికి అన్ని రంగాల్లో తమ ప్రాధాన్యత ఉండాలి కానీ కొన్ని రాజకీయ శక్తులు కుయుక్తులు వేయడం వల్ల కొన్ని వర్గాల వారు వెనకబడి ఉన్నారన్నారు. తమ సంస్థ తరఫున అన్ని వర్గాలవారికి ఆర్థిక రాజకీయ సామాజిక సహాయ సహకారాలు అందించాలన్న సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు తరచుగా చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాల పరిధి పెంచి మరింత మందికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చడం జరుగుతుందని తెలియజేయడం జరిగిందన్నారు. అతిథులుగా విచ్చేసిన ముద్దాడ మధు మాట్లాడుతూ … తన ఆహ్వానం మేరకు ఈ వార్డులో ఈ కార్యక్రమం జరపడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. పేద వర్గాలు కుటుంబీకులకు మాత్రమే కాకుండా విద్యార్థులకు యువతకు కూడా భవిష్యత్తులో మంచి సేవా కార్యక్రమాలతో ఈ ట్రస్టు ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైయస్సార్‌ విద్యార్ధి విభాగం రీజినల్‌ కోఆర్డినేటర్‌ జానకిరామ్‌ మాట్లాడుతూ … అణగారిన పేద వర్గాలకు బియ్యం పంపిణీ కార్యక్రమం అదేవిధంగా పేద విద్యార్థులకు పుస్తకాలు పరీక్ష కిట్లు పంపిణీ చేయడం శుభ పరిణామం అని కొనియాడారు. యాట కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అప్పలరాజు మాట్లాడుతూ … పేద ప్రజలకు బియ్యం పంపిణీ కార్యక్రమం అన్ని సేవల్లో ఉత్తమమైన సేవ అని అన్నారు. ఈ సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మరింత దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలు మరింత పెద్ద మొత్తంలో కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కె ఆర్‌ హెల్పింగ్‌ హాండ్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ టీం సభ్యులు బి కిరణ్‌ కుమార్‌ మేడూరు నవీన్‌ దాస్‌ అనిల్‌, రాము నాయుడు తదితరులు పాల్గొనడం జరిగింది.

➡️