ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : దక్షిణ భారత స్థాయి సైన్స్ ఫెయిర్కి విజయనగరం జిల్లా రాజాం మండలం డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఐ.హాసిని ఎంపికైంది. స్మార్ట్ ట్రాలీ ప్రయోగానికి రాష్ట్ర స్థాయిలో హాసినికి వ్యక్తి గత విభాగంలో ప్రథమ బహుమతి వచ్చింది. మాల్స్, సూపర్మర్కెట్, షాపులలో సరుకులు రవాణా సులువుగా చేయుటకు ఉపయోగ పడుతుంది. స్వయం నియంత్రణతో పనిచేస్తూ వృద్దులకు, దివ్యాంగులకు ఉపయోగపడుతుంది. ఈ నెల 27వ, తేదీ నుంచి 6 రోజులు పాటూ విజయవాడలో జరుగనున్న దక్షిణ భారత స్థాయి సైన్స్ ఫెయిర్లో ఈ స్మార్ట్ ట్రాలీ పాల్గొంటుంది. జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్ కు ఎంపిక కాబడిన విద్యార్ధి ఐ.హసినిని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వర రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్ యం. శ్రీదేవి, జిల్లా సైన్స్ అధికారి యం.కృష్ణారావు పాల్గొన్నారు.