ప్రజాశక్తి-తాళ్లపూడిదేశంలోనూ రాష్ట్రంలోనూ అన్ని వర్గాల ప్రజలకు సుస్థిర సుపరిపాలన కావాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని అన్నదేవరపేటలో సోమవారం ఎంపీతో పాటు కొవ్వూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరిగెల అరుణకుమారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో అభ్యర్థులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలను ఓటర్లకు వివరించారు. రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో వీరి వెంట కాంగ్రెస్ నాయకులు పోసిన వెంకట నారాయణ జి.సాయిబాబా, కె.శ్రీనివాస్, ఎస్.మారియ్య పాల్గొన్నారు.