ఉపాధి హామీ పని దినాలు పెంచాలి

May 11,2024 16:59

మస్తరు తీసుకుంటున్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌

ప్రజాశక్తి-ఉండ్రాజవరం

గ్రామీణ ఉపాధి హామీ పని దినాలను పెంచి, పే స్లిప్పులు ఇవ్వాలని దమ్మెన్ను ఉపాధి హామీ కూలీలు దంపనబోయిన ధనలక్ష్మి, పి.ఆనందరావు, కె.సూరి పండు తదితరులు కోరుతున్నారు. దమ్మెన్నులో శనివారం కాలువ పూడిక తీత పనులు నిర్వహిస్తున్న వారు మాట్లాడుతూ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయన్నారు. మూడు రోజులుగా వర్షం పడటంతో తవ్వకాలు కష్టంగా ఉన్నాయంటున్నారు. వారం కూలి డబ్బులు బ్యాంకులో పడటం ఆర్థికంగా సహాయపడుతుందని, పే స్లిప్పులు పంపిణి ఆపివేయడంతో జీతం ఎంత వచ్చేది తెలియడం లేదన్నారు. సర్పంచ్‌ గురజర్ల వీర వెంకట సత్యనారాయణ కూలీల సమస్యల గురించి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కొల్లి కిషోర్‌ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మస్తర్‌ తీసుకున్న అనంతరం, వారికి ఓఆర్‌ఎస్‌ ద్రావణం పంపిణీ చేశారు.

 

➡️