ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ఎపి ప్రభుత్వం నిర్వహించిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో రాజమ హేంద్రవరంలోని తిరుమల విద్యార్థులు 120 మార్కులకు 120 మార్కులతో స్టేట్ ఫస్ట్, ఇతర ఉత్తమ ర్యాంకులు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. జె.యశ్వంత్ సాయి, సిహెచ్ఎన్విఎస్ వర్షిణి స్టేట్ ఫస్ట్ ర్యాంకును, 120 మార్కులకు గాను 119 మార్కులతో జి.ప్రభవ్ తేజ, డి.శ్రీవేద్ స్టేట్ 7వ ర్యాంకును సాధించారని చిట్టూరి త్రివేణి, ఈడుపుగంటి వంశీధర్, పదిలం వెంకట నాగ సూర్య ధావన్ స్టేట్ 14వ ర్యాంకును, గన్నంనీడి వాత్సల్య స్టేట్ 21వ ర్యాంకును, మోకరాల కష్ణ శ్రావణ సాకేత్, మంగు సాయి కిరణ్ సుబ్రమణ్య స్టేట్ 24వ ర్యాంకును, యడ్లూరి కష్ణ చైతన్య స్టేట్ 40వ ర్యాంకును, నల్లబోతుల షణ్ముఖ సాయినాధ్, మద్దు సూర్యదేవ్, చింతపల్లి భార్గవ శ్రీ వెంకట గణేష్, తొండ ప్రీతిక శరణ్య స్టేట్ 42వ ర్యాంకును సాధించారని ఆయన తెలిపారు. టాప్ 20లో 7 ర్యాంకులు, టాప్ 50లో 15 ర్యాంకులు, టాప్ 100లో 24 ర్యాంకులు సాధించి అత్యుత్తమ ఫలితాలను పొందారని ఆయన అన్నారు.