అగ్ని ప్రమాద బాధితులకు ఎంపీ పరామర్శ

ప్రజాశక్తి – ముసునూరు
అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. మండలంలోని చెక్కపల్లి గ్రామానికి చెందిన నక్కా చెన్న కేశవులుకు చెందిన పూరిల్లు నాలుగు రోజుల క్రితం విద్యుత్‌ షార్టు సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైంది. ఎంపీ శ్రీధర్‌ బాధిత కుటుంబసభ్యులను గురువారం పరామర్శించారు. అనంతరం నూజివీడు డివిజన్‌, మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బందితో మాట్లాడి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయం, నూతన గృహం మంజూరు చేయాలని ఆదేశించారు. వైస్‌ ఎంపిపి కోటగిరి రాజానాయన, వైసిపి నాయకులు కాటేపల్లి రమేష్‌ పాల్గొన్నారు.

➡️