వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత

Nov 23,2023 21:59

ప్రజాశక్తి – ఆగిరిపల్లి
వికలాంగులకు కృత్రిమ అవయవవాలను అందించడం వల్ల వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించవచ్చని నూజివీడు సీడ్స్‌ అధినేత మండవ రమాదేవి అన్నారు. మండల పరిధిలోని తోటపల్లి హీల్‌-ఎలిజబెత్‌ ఫాంటన్‌ లెగసీ ఆఫ్‌ హోప్‌ కృత్రిమ అవయవ కేంద్రంలో ఐదుగురు వికలాంగులకు ఆమె కృత్రిమ కాళ్లను అందించారు. సదరు కృత్రిమ అవయవాలకు ఆమె నగదును అందించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సీడ్స్‌ ప్రతినిధులు నూతక్కి అరుణకుమారి, మండవ సునీత, ఎంవి.నారాయణ, హీల్‌ కార్యదర్శి టి.లక్ష్మి, సీనియర్‌ టెక్నిషియన్‌ కె.చిన్నా, పిఎస్‌.వరకుమార్‌ పాల్గొన్నారు.

➡️