మనస్వికి కొలుసు పార్ధసారధి అభినందన

ప్రజాశక్తి – ముసునూరు
పదో తరగతి ఫలితాల్లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన ముసునూరు మండలానికి చెందిన విద్యార్థిని ఆకుల వెంకటనాగసాయి మనస్విని టిడిపి నూజివీడు ఎంఎల్‌ఎ అభ్యర్థి కొలుసు పార్థసారధి అభినందించారు. పార్ధసారధి మండలంలోని రమణక్కపేట గ్రామానికి చెందిన ఆకులవెంకటనాగ సాయి మానస్వి ఇంటికి వెళ్లి ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు ప్రాంతానికి చెందిన విద్యార్థి వెంకట నాగ సాయి మనస్వి 599 మార్కులు సాధించి, రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించడం నూజివీడు ప్రాంతానికి ఎంతో గర్వకారణమన్నారు. విద్యార్థి కృషి, పట్టుదల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం కలిపితే ఇంతటి గొప్ప విజయాన్ని సాధించగలగరన్నారు. విద్యార్థి ఉన్నత చదువులకు ఎటువంటి సహాయం కావాలన్నా, తాను అండగా ఉంటానని, మరింత ఉన్నత చదువులు చదివి నూజివీడు ప్రాంతానికి మరింత పేరు తీసుకురావాలన్నారు.

➡️