ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

ప్రజాశక్తి – చింతలపూడి

ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ ఇంటింటి ప్రచారంలో భాగంగా బుధవారం పాత చింతలపూడి గ్రామంలో సిపిఐ కార్యకర్తలు తెలిపారు. ఇండియా వేదిక అభ్యర్థులని గెలిపించాలని, మతోన్మాద బిజెపిని ఓడించాలని పిలుపునిస్తూ ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, సహాయ కార్యదర్శి తొర్లపాటి బాబు, శాఖ కార్యదర్శి ముల్లగిరి నాగేశ్వరావు, మండల కమిటీ సభ్యులు బోడ వజ్రం, మల్లగిరి లాజరు, సరిపెల్లి లెనిన్‌, తొర్లపాటి రాజు పాల్గొన్నారు.

➡️