సమస్యల పరిష్కారానికి తొలి అడుగు

Jun 29,2024 21:16

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌  : పట్టణ సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర అడుగులు వేశారు. ఇందులో భాగంగా శనివారం ఆయన పట్టణంలో గల ఫ్లైఓవర్‌ మీద ఏర్పడిన గోతులతో పాటు, రహదారుల్లో ఏర్పడిన గోతులపై దృష్టి సారించారు. బైపాస్‌ రోడ్‌, ఫ్లై ఓవర్‌పై గోతులను ఎమ్మెల్యే పరిశీలించారు. వీటిపై ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించారు. ఈ గోతుల వల్ల పలువురు వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్న సందర్భాలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌కు గోతులకు మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారి పి.కిరణ్‌ కుమార్‌ పర్యవేక్షణలో గోతులకు మరమ్మతు పనులు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. దీంతో ఫ్లైఓవర్‌పై రాకపోకలు సాగించే వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నాయకులు బార్నాల సీతారాం, పట్టణ టిడిపి అధ్యక్షులు గుంట్రెడ్డి రవికుమార్‌, కౌన్సిలర్లు కోరాడ నారాయణరావు, బడే గౌరినాయుడు, నాయకులు సిరిపురపు భాస్కరరావు, కోలా మధు, పత్తిగుల్లి సత్యనారాయణ, సారికి గణేష్‌, సుంకర ప్రసాద్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️