మరో అవకాశమివ్వండి

May 8,2024 21:23

ప్రజాశకి-విజయనగరం టౌన్‌: ఎమ్మెల్యేగా మరోసారి గెలిపిస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని డిప్యూటీ స్పీకర్‌, ఆ పార్టీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అభ్యర్థిం చారు. బుధవారం నగరంలోని 8వ డివిజన్‌ లెంక వీధి, లక్క పందిరి వీధి, ఆనంద పేట, దక్షిణ గట్టు, ఆనంద్‌ ఎన్‌ క్లేవ్‌ తదితర ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అడుగడుగునా మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ మరోసారి తనకు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. వైసిపి నాయకులు డోల మన్మధ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ పాలన సాగిందన్నారు. స్థానికంగా కోలగట్ల వీరభద్ర స్వామి నేతృత్వంలో అభివద్ధే ధ్యేయంగా అనేక మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. ఎన్నో ఏళ్లనాటి సమస్యలు కూడా పరిష్కారమయ్యా యన్నారు. వైసిపి అత్యధిక స్థానాలలో గెలుపొంది రికార్డు సృష్టించబోతుందని చెప్పారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, డివిజన్‌ ఇన్‌ఛార్జి అడారి నగేష్‌, చిల్లా పుష్ప, పల్లి సన్యాసిరావు, చిట్టెళ్ళ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️