ప్రజాశక్తి-చిలకలూరిపేట : మండలము లింగంకుంట్ల వద్ద ఆర్.టి.సి.బస్సు మండల పరిధిలో గల ఏలూరు గ్రామం నుంచి కూలి పనులకు వెళ్తున్న ఆటోని ఢీ కొనటంతో ఆటోలో ఉన్న 10 మంది కూలీలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. అందులో కొంత మంది పరిస్థితి మరీ విషమయంగా ఉందని తెలియవస్తుంది. ఒకరిద్దరకి ప్రాణాపాయ పరిస్థితులల్లో వున్నారు. వారిని చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి నాదెండ్ల అంబులెన్స్ లో తరలిస్తున్నారు. వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
![road accident in chilakaluri peta](https://prajasakti.com/wp-content/uploads/2024/01/road-accident-in-chilakaluri-peta.jpg)