ప్రజాశక్తి-పొదిలి: జూన్ 30, జూలై 1 తేదీల్లో పొదిలిలో జరుగనున్న ఆశా వర్కర్స్ శిక్షణ తరగతులకు స్థానిక జనసేన నాయకులు, సీనియర్ న్యాయవాది వరికూటి నాగరాజు రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు రాఘవమ్మ, కార్యదర్శి కల్పన, నాయకురాలు పద్మ విజ్ఞప్తి మేరకు జనసేన నాయకులు వరికూటి నాగరాజు రూ.10 వేల ఆర్థిక సాయం చెక్కును అందించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఈ సాయం అందజేశారు. తనకు చేతనైన సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటానని తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/PDL-PH-2-1.jpg)