ప్రజాశక్తి-పుల్లలచెరువు యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ప్రజలందరికీ అండగా ఉంటాను. ప్రతి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కరించేందుకు షి చేస్తానని టిడిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. శనివారం పుల్లలచెరువు మండలం రంగన్నపాలెంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చైతన్య రథంపై గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు హారతులిచ్చి, పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎరిక్షన్బాబు మాట్లాడుతూ నియోజకవర్గం ఏర్పాటు జరిగిన నాటి నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కేవలం తమ స్వప్రయోజనాల కోసం పని చేశారే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాగునీటి సమస్యకు శాశ్విత పరిష్కారం చూపుతానని తెలిపారు. ప్రధానంగా డ్రైనేజీ కాలువలు, అంతర్గత రహదారులు సక్రమంగా లేక ప్రజలు అవస్ధలు పడుతున్నట్లు చెప్పారు. ప్రజలు తమ సంపూర్ణ మద్దతునిచ్చి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు డాక్టర్ మన్నె రవీంద్ర, మండల కన్వీనర్ పయ్యావుల ప్రసాద్, నాయకులు బివి సుబ్బారెడ్డి, కొమరోలు సర్పంచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.