దేశ ప్రగతికి ఇండియా వేదిక

పొన్నూరులో పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొన్న ముప్పాళ్ల నాగేశ్వరరావు

పొన్నూరు: ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర, దేశ ప్రగతికి తోడ్పడాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు. బుధవారం పొన్నూరు సిపిఐ కార్యాలయంలో పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలోని సహజ వనరులను మోదీ తన సహచరులకు కట్టబెట్టి విధ్వంసానికి అడు గులు వేస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలపై పెనుభారాలు మోపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు పలు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. దేశ, రాష్ట్రంలోని ప్రజల భవిష్యత్తు బాగుపడాలంటే ఇండియా వేదిక అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయితే కార్మిక, రైతు హక్కులతో పాటు ముస్లిం మైనారిటీ హక్కు లను కాలరాస్తారని అన్నారు. దేశంలో మోడీ సర్కార్‌ ను రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి విధ్వంస ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా సిపిఐ కార్యదర్శి టి.సింగర కొండ, సిపిఐ పొన్నూరు నియోజకవర్గ కార్యదర్శి పి.సత్యనారా యణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.రంగారెడ్డి, బాపట్ల నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి జె.భాగ్యశ్రీ, పొన్నూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి ఎ.రామా రావు, గేయ రచయిత డి. శ్రీనివాస్‌, గుంటూరు ఏడు కొండలు, పి.రాజు పాల్గొన్నారు.

➡️