- 70 వేల రూపాయలు సీజ్
ప్రజాశక్తి గణపవరం(పశ్చిమగోదావరి) : మండలంలో మొయ్యేరు శివాలయం వద్ద బుధవారం ఎఫ్ఎస్టి అధికారులు వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాలకొల్లుకు చెందిన ముదునూరి కృష్ణంరాజు వాహనంలో ఎటువంటి అనుమతి పత్రాలు లేని ఆధారాలు లేని 70 వేల రూపాయలు సొమ్మును స్వాధీనం చేస్తున్నట్లు ఎఫ్ఎస్టి అధికారి లక్ష్మీ సరస్వతి తెలిపారు.