తాకట్టులతో అభివృద్ధి సాధ్యమా 

Mar 3,2024 14:48 #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరం కోట : తాకట్టు లతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమా! అని విజయనగరం టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిని పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. శంఖారావం – బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం 38వ , 39వ డివిజన్ లలో బొబ్బాదిపేట, మహాలక్ష్మి నగర్, సచివాలయం వీధి, సైలాడ కోలనీ, ఆదిత్య నగర్, వుడా కోలనీ ఫేస్-3 మొదలగు ప్రాంతాలలో నియోజకవర్గ ఇంచార్జ్, తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీ విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఇంటింటి ప్రచారం నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం – జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలందరికి తెలియజేసారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ఇంచార్జ్ పూసపాటి అదితి గజపతి రాజు మాట్లాడుతూ ఇంటింటి వెళ్లి ప్రజలను కలుసుకున్నప్పుడు ప్రజలు ఈ వైకాపా ప్రభుత్వ పాలనలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేస్తున్నారన్నారు, వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అధోగతిపాలు చేసి అప్పుల ఊబిలో నెట్టిన జగన్, ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి తీసుకువెళ్లారు, చివరకు రాష్ట్ర సచివాలయం కూడా తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మహిళలకు రక్షణ లేదు, యువతకు ఉద్యోగాలు లేవు. ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాలలో అభివృద్ధి, సంక్షేమం తో సమానంగా ముందుకు నడిపించగల సమర్ధ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని, అందుచేత తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటకు ప్రజలు సహకరించి రానున్న ఎన్నికలలో సైకిల్ గుర్తు పై ఓటు వేసి నన్ను గెలిపించి తద్వారా నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, కార్యాలయ కార్యదర్శి రాజేష్ బాబు, రాష్ట్ర బీసీ నాయకులు వేచలపు శ్రీనివాసరావు,అవనాపు విజయ్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️