వర్మ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ

May 8,2024 22:26
రాబోయే ఎన్నికల్లో జనసేన

ప్రజాశక్తి – పిఠాపురం

రాబోయే ఎన్నికల్లో జనసేన పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విజయం కోరుతూ మాజీ ఎంఎల్‌ఎ వర్మ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. బుధవారం ఆటో యూనియన్‌ సంఘాలకు చెందిన డ్రైవర్లు ప్రచార ర్యాలీ నిర్వహించారు. అలాగే గొల్లప్రోలు మండలం చెందుర్తి, చిన్న జగ్గంపేట, ఎ.విజయనగరం గ్రామాల్లో ఇంటింటా ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ కూటమి మ్యానిఫెస్టో రాష్ట్ర ప్రజలందరికి శ్రీరామరక్షలాంటిదని అన్నారు. జగన్‌ 13 లక్షలు కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దివాలా తీయించారన్నారు. రాష్ట్ర అభివీద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. రండు ఓట్లు కూడా గాజు గ్లాసు గుర్తుకు వేసి ఎంఎల్‌ఎగా పవన్‌ కళ్యాణ్‌ను, ఎంపీగా తంగెళ్ల ఉదరు శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, జనసేన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

➡️