ప్రజాశక్తి – పెద్దాపురం
సిఎం జగన్ మోస పూరిత హామీలతో కాపులను మభ్య పెట్టారని కాపు జెఎసి అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామ కృష్ణ, ప్రకాష్ అన్నారు. బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడుతూ సిఎం జగన్మోహన్ రెడ్డి కాపుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. కాపు కార్పొరేషన్ పేరుతో కాపు, ఒంటరి, బలిజ, తెలగా కులస్తులకు ఇస్తామన్న వందలాది కోట్లు కాగితాలకే పరి మితం చేశారన్నారు. ఇప్పటివరకు వారికి ఎటు వంటి ప్రయోజనం కలగలేదన్నారు. కాపు జెఎసికి ముద్రగడ పద్మనాభంకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కాపు జెఎసి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 45 నియోజకవర్గాలలో ఎన్డిఎ కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి జరుగుతుందన్నారు. పెద్దాపురం నియోజక వర్గంలో ఎన్డిఎ కూటమి అసెంబ్లీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని వారు ఓటర్లను కోరారు.