ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : ఈనెల మూడో తేదీన మంగళగిరి పట్టణంలోని కాండ్రువారి వీధిలోని నివాసంలో 136 కేస్ ల అక్రమ మద్యం ను మంగళగిరి సెబ్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ 2 గా ఉన్న కాండ్రు శివ నాగేంద్ర ను విజయవాడలో మంగళగిరి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. మద్యం లభించిన ఇంటి యజమానిని ఏ 1 గా అరెస్ట్ చేశారు. మద్యం సీసాల పై ప్రభుత్వ స్టిక్కర్ సీల్ ను తొలగించటంతో మద్యం ఏ దుకాణాల నుండి వచ్చిందనేది నిర్ధారణ కాలేదు. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ను, వైసిపి పార్టీకి చెందిన మండల పార్టీ నాయకుడు ఈ కేసులో ఉన్నట్లుగా తెలిసింది. వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/madyam.jpg)