ప్రజాశక్తి-చీరాల జరగనున్న ఎన్నికల్లో వైసీపీ చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్కు అందరూ ఓట్లు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కోరారు. స్థానిక ముంతావారి సెంటర్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ఆయన మాట్లాడారు. పోలింగ్ బూత్లో ఈవీఎం మిషన్లో వైసీపీకి ఏ విధంగా ఓటు వేయాలో వారికి అవగాహన కల్పించారు. ఈ ఎన్నికలలో వెంకటేష్ ను ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం స్థానిక కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులను కలిసి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ఆర్ అండ్ పీఎం హై స్కూల్ గ్రౌండ్లో వాకర్స్ను కలిసి వెంకటేష్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సహకారంతో గత ఐదు ఏళ్లలో చీరాల నియోజకవర్గానికి అత్యధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా హైస్కూల్లో పార్కు డెవలప్మెంట్ మరియు మహిళల కోసం ప్రత్యేకమైన వ్యాయామశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభివృద్ధిని కొనసాగించాలన్నా, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా ముఖ్యమంత్రిగా జగన్ మోహన్రెడ్డి ఉండాలని ఆయన అన్నారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ను, బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా నందిగం సురేష్ గెలిపించాలని ఆయన వాకర్స్ను కోరారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, టౌన్ అధ్యక్షులు కోండ్రు బాబ్జి, వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ, గుంటూరు మాధవరావు, కాసాని రాము, కోడూరి ప్రసాద్రెడ్డి, గోలి గిరిధర్, గోలి గంగాధర్, వల్లెపు శ్రీనివాసరావు తదితర నాయకులు, వాకర్స్, యువకులు ఉన్నారు.