ఓటు హక్కు పై విద్యార్థులకు అవగాహనా సదస్సు

May 11,2024 17:13

కాకినాడ -రామచంద్రపురం మెయిన్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన హార్డింగ్‌

ప్రజాశక్తి-రామచంద్రపురం

సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని పట్టణంలో గల రాజరత్న కిట్స్‌ కళాశాల యాజమాన్యం హెల్త్‌ కేర్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ విద్యార్థులకు ఓటు హక్కు వినియోగంపై శనివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ప్రతి ఓటు విలువైన దేనిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు వేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అదే విధంగా రామచంద్రపురం కాకినాడ మెయిన్‌ రోడ్‌ లో పెద్ద హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. దానిపై ప్రతి ఓటు విలువైనదని, కచ్చితంగా ఓటు వేయండి అనే నినాదంతో ఏర్పాటు చేశారు. నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే ఈ మెయిన్‌ రోడ్‌ పై ఉన్న హోర్డింగ్‌ ప్రయాణికులను ఆలోజింప చేస్తుంది. దీనిపై పలువురు కళాశాల కరస్పాండెంట్‌ ఎం.పవన్‌ కుమార్‌ను, ఉపాధ్యాయ బందాన్ని అభినందిస్తున్నారు. ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఏర్పాటుచేసిన హోర్డింగ్‌లపై పలువురు యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నారు.

 

➡️