పరిసరాల పరిశుభ్రతతో వ్యాధుల నిర్మూలన

Apr 26,2024 18:21

చెముడులంకలో వైద్యపరీక్షలు చేస్తున్న వైద్యాధికారి డాక్టర్‌ సువర్చల

ప్రజాశక్తి-ఆలమూరు

పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు నివారించుకోవచ్చని పిహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్‌ సువర్చల, డాక్టర్‌ మల్లిఖార్జునరావు, డాక్టర్‌ భవాని శంకర్‌ అన్నారు. మండలంలోని చొప్పెల్ల పిహెచ్‌సి పరిధి చెముడులంకలో ‘ఫ్యామిలీ డాక్టర్‌” కార్యక్రమాన్ని వైద్య సిబ్బందితో కలిసి వారు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలన్నారు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నాయన్నారు. ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిహెచ్‌ఒ కె.జ్యోతి కుమార్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ సూర్యనారాయణ, హెచ్‌వి ఎఆర్‌బి.మణి, హెచ్‌ఎస్‌.శివప్రసాద్‌, ఎఎన్‌ఎంలు మంగాయమ్మ, శ్రీలక్ష్మి, రాజమణి, ఆశాలు, హెల్త్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

 

➡️