విజయం కోసం కష్టపడాలి : మాజీ మంత్రి

Mar 29,2024 14:58 #Konaseema

ప్రజాశక్తి-రాజోలు: పార్టీ విజయం కోసం అందరూ కష్టించి పనిచేయాలని వైసిపి రాజోలు నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. శుక్రవారం తాటిపాక లో మామిడికుదురు మండలం లోని బుత్ కన్వీనర్లు,బుత్ కమిటీ సభ్యలులోతో ఎన్నికల నిర్వహణపై సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు దాదాపు 100కు హామీలను మేనిఫెస్టో ద్వారా ప్రకటించడం జరిగిందన్నారు. వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి పెద్దపీట వేసారన్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు అమ్మబడి, విద్యాకానుక, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ వంటే పథకాలు అమలు చేసి విద్యాభివృద్ధికి పాటు పడ్డారన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారన్నారు.తాను పార్టీలకు అతీతంగా అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశానని, రాజోలు నియోజకవర్గంలో ఎలాంటి వ్యతిరేకత లేని పలాన చేశానని ఆయన‌ తెలిపారు. వైసిపిలో అన్ని వర్గాల నాయుకులను కలుపుకుని వెళ్లి అందరిని ఒకే తాటిపైకి తెచ్చి రానున్న ఎన్నికలలో రాజోలు నియోజకవర్గంలో వైసిపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

➡️