దళిత విద్యార్థిపై టీచర్ అమానుష దాడి

Mar 23,2024 16:48 #Krishna district

 ఖండించిన గుడ్లవల్లేరు దళిత ఐక్య వేదిక

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : ఈనెల 20 నబాపట్ల ఇంజనీరింగ్ కళాశాల లో డిప్లొమా చదువుతున్న దళిత విద్యార్థి బొనిగల నవదీప్ పై విచక్షణారహితంగా కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరచి, మీ కులం వాళ్ళకు చదువెందుకురా అంటూ శారీరకంగా, మానసికంగా హిసించి, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన డ్రాయింగ్ టీచర్ కొత్తమాసు బాలాజీ, మరియు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల చర్యలను గుడ్లవల్లేరు మండల దళిత ఐక్య వేదిక మరియు అంబేద్కర్ ఇండియా మిషన్ తీవ్రంగా ఖండించారు. శనివారం తాసిల్దార్ అనిల్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. నిందితుడు కొత్తమాసు బాలాజీ ని వెంటనే అరెస్టుచేసి, కఠినంగా శిక్షించాలని, బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల పైనా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ, బాధితుడు బొనిగల నవదీప్ కు వైద్య సహాయం, రక్షణ కల్పించాలని దళిత ఐక్య వేదిక మరియు అంబేద్కర్ ఇండియా మిషన్ గుడ్లవల్లేరు మండల నాయకులు పెయ్యల సురేష్ బాబు, భేతాళ దేవ సహాయం, గురజ రాంబాబు, కంచర్ల ప్రకాష్, పాగోలు ఏడుకొండలు, వనాబత్తిన శ్రీనివాస్, పులి ప్రశాంత్, బొల్లవరపు రాజేంద్ర, జంగం సుధాకిరణ్, నిమ్మగడ్డ సాగర్, జక్కుల నాగరాజు, మద్దాల జోజి, బాయిరెడ్డి శేఖర్, గొడ్ల అభిషేకం, గోగులమూడి చిట్టిబాబు, పాగోలు అనిల్, గోట్రు నాగబాబు, మేకల అనిల్, బొడ్డు ఏసుపాదం, చింతా రాజేష్, చేబత్తిన నాని, కొనాల ప్రసాద్, గొర్రెముచ్చు రమణ, గుమ్మడి నాగరాజు, పాగోలు హరీష్, కాకి నాగు, బోలపాటి సువిశేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

➡️